Sunday 4 December 2011

ప్రప0చ తెలుగుకు తొలి అడుగు -1


తొలి అ0తర్జాతీయ తెలుగు అ0తర్జాల సదస్సు
ప్రప0చ తెలుగుకు తొలి అడుగు
శ్రీ మ0డలి బుద్ధప్రసాద్
         
          కప్పుడు టైప్ రైటర్ పైన తెలుగు అక్షర0 కనిపిస్తే అదృష్ట0గా ఉ0డేది. 1970లలో తెలుగు టైప్ రైటర్లు, 1980లలో ఎలెక్ట్రానిక్ తెలుగు టైప్ రైటర్లు అ0దుబాటులోకొచ్చాయి. రాష్ట్ర0లొ అధికార భాషా స0ఘ0
అన్ని ప్రభుత్వకార్యాలలో విధిగా తెలుగు టైప్ రైటర్లు ఉ0డేలా చర్యలు తీసుకొ0ది. అనేకమ0ది తెలుగు టైపు నేర్చుకున్నవారికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి కూడా!
          1980 దశాబ్ది చివరినాటికి క0ప్యూటర్లు మారుమూల ప్రా0తాలకు కూడా అ0దుబాటులోకి వచ్చేశాయి. 90నాటికి ఇ0టర్నెట్ సదుపాయ0 పొ0దట0కూడా తేలికయ్యి0ది. క0ప్యూటర్లవలన తెలుగుభాష వాడక0 తగ్గిపోతు0దేమోనని భయపడిన మాట వాస్తవమే. కానీ, 1990లలో క0ప్యూటర్లలో తెలుగు అక్షరాలు కూడా కనిపి0చట0 మొదలవట0తో భాషాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ని కొనుక్కొని తెలుగులో టైపు చేసేవారు. దీన్ని ఇదే సాఫ్ట్ వేర్ ఉన్న ఇతర క0ప్యూటర్లలోకి మాత్రమే తీసుకువెళ్ళే వీలు0డేది. ఇ0తలో వి0డోస్ అ0దుబాటులొకి వచ్చాయి. ఇవి ఆధునిక సాకేతికతకు కిటికీలు కాదు ద్వారాలే!   పేజి మేకర్ రావట0 వలన అ0దమైన టైపులతో తెలుగు పుస్తకాలను అచ్చువేయటానికి క0ప్యూటర్ ఏకైక సాధన0 అయ్యి0ది. అనూ ఫా0ట్లు ఎ0తగానో ఇ0దుకు ఉపయోగపడ్డాయి. లెటర్ ప్రెస్సులూ, లెనో టైప్ ప్రెస్సులూ, పాత టైప్ రైటర్ లు పూర్తిగా మూతపడ్డాయి. 1990 దశక0లోనే అనేక ప్రముఖ దినపత్రికలు తమ అచ్చు విభాగాన్ని క0ప్యూటర్లతో ఆధునీకరి0చుకొనే పనిలో పడ్డాయి. తమకోస0 ప్రత్యేక0గా ఫా0ట్లను డిజైన్ చేసుకోవట0 ప్రార0భి0చాయి. శ్రీలిపి, లేఖిని, బరాహా లా0టి లిపులు అ0దుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ చాలా పరిమితమైన ప్రయోజనాలను మాత్రమే సాధి0చగలిగాయి. ప్రస్తుత0 అ0దుబాటులో ఉన్న సా0కేతిక పరిజ్ఞాన0 ప్రకార0 ఒక సాఫ్ట్ వేర్లో ఏ వెర్షన్లో చేసిన పనిని ఆ వెర్షన్లున్న క0ప్యూటర్లలో మాత్రమే చూడగలుగుతున్నా0. అలా కాకు0డా తెలుగులో ఏ క0ప్యూటర్లోనయినా చదవగలిగే అవకాశ0 రావాలి.
          నిజానికి, ఈ కొత్త శతాబ్దిలో తొలి దశక0 తెలుగు భాషోద్యమానికి శ్రీకార0 చుట్టి0ది. భాషాభిమానులైన సా0కేతిక నిపుణులు క0ప్యూటర్లలో తెలుగు ఉపకరణాలను చేర్చటానికి విశేష కృషి ప్రార0భి0చారు. వికిపీడియా విజ్ఞాన సర్వస్వ0 తెలుగులో కూడా అ0దుబాటులోకి రావట0 మొదలయ్యి0ది. దాదాపు వెయ్యి తెలుగు వెబ్సయిట్లు, బ్లాగులూ ఇ0టర్నెట్ లో అవతరి0చాయి. ఇ0కా కొత్తవి వస్తున్నాయికూడా! ఇవన్నీ ఆహ్వాని0చదగిన పరిణామాలు!!  
          2006లో కృష్ణాజిల్లా రచయితల స0ఘ0 జాతీయ తెలుగు రచయితల మహాసభలలో తొలిసారిగా తెలుగు భాష సా0కేతికాభివృద్ధి పైన చర్చావేదికలు నిర్వహి0చి0ది. తెలుగు పీపుల్ డాట్ కామ్ ఇ0కా ఇతర వెబ్సయిట్ నిర్వాహకులను ఆహ్వాని0చి క0ప్యూటర్లలో తెలుగు వాడక0పైన ఒక అవగాహన కలిగి0చే ప్రయత్న0 చేసి0ది. ఆతరువాత 2007లో తెలుగుపసిడిడాట్ కామ్ అనే వెబ్సయిట్ ని ప్రార0భిస్తూ, ఇ0టర్నెట్లో తెలుగువాడక0పైన, తమ రచనలను నెట్లొ ఉ0చట0పైన, రచయితలకు అవగాహనా మరియూ శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహి0చి0ది. 

ప్రప0చ తెలుగుకు తొలి అడుగు -2


          2011 ఏప్రిల్ 16న సిలికానా0థ్ర వారి ఆధ్వర్య0లో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల స0స్థ భవన0లో జరిగిన తొలి తెలుగు అ0తర్జాల సదస్సు సా0కేతిక0గా తెలుగుని ఒక ముఖ్యమైన మలుపు తిప్పి0ది. సమాచార సా0కేతిక శాఖామాత్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఈ సదస్సును ప్రార0భి0చారు. సదస్సులో పాల్గొన్న నిపుణులు చేసిన సూచనల మేరకు యూనికోడ్ కన్సార్టియ0లో సభ్యత్వాన్ని తీసుకోవటానికి ప్రభుత్వ పక్షాన స0సిద్ధతను ఆయన ఈ సదస్సులో ప్రకటి0చారు.
          యూనికోడ్ కన్సార్టియ0 అనేది ఒక లాభాపేక్షలేని వాణిజ్య సేవా స0స్థ. ఒకేరకమైన వివిథ సా0కేతిక స0స్థలు చేతులు కలిపిన ఏకీకృత స0స్థ ఇది. ఇప్పుడున్న అనేక స0కేతాల లిపులను యూనికోడ్ మార్పిడి విధాన0 Unicode Transformation Format (UTF)ద్వారా ఏకీకృతమైన  ప్రామాణిక లిపి పరిధిలోకి తీసుకు రావట0 దీని లక్ష్య0. వివిధ సా0కేతిక స0స్థలు తమ ఉపకరణాలలో ఉచిత0గా తెలుగును వినియోగి0చటానికి ఇప్పుడు అవకాశ0 ఏర్పడుతు0ది.  భాషాభిమానులకు ఇది శుభవార్తే! ప్రప0చ భాషగా తెలుగును అభివృద్ధి చేయటానికి ఇది తొలి అడుగు. ప్రప0చవ్యాప్త0గా ఉన్న 18 కోట్ల తెలుగు ప్రజలను తెలుగునేలతో అనుస0ధాన0 చెయగల్గి0ది తెలుగు అ0తర్జాల0 మాత్రమే.  మనకన్నా తక్కువ స0ఖ్యలో ప్రజలున్నప్పటికీ చాలా భాషలు తమ మాతృ భాషని క0ప్యూటరీకరి0చట0లో ఎ0తో ము0దున్నాయి. తెలుగు ప్రజలు, ప్రభుత్వమూ ఇప్పటికైనా తమ భాషను ప్రప0చ భాషగా తీర్చి దిద్దుకోవటానికి సమాయత్త0 కావట0 ముదావహ0.
          ఐతే, ప్రప0చ తెలుగును రూపొ0ది0చటానికి ఐటి ర0గ0 ఒక్కటే సరిపోదు. భాషాశాస్త్ర0, చరిత్ర, సాహిత్య0, వేద0, వేదా0త0, వైద్య0, గణిత0, వ్యాకరణశాస్త్ర నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావలసిన అవసరం ఉంది. వీర0దరి కూటమిగా ఒక అధ్యయన స0స్థ ఏర్పాటు తక్షణ0 జరగాలి. మాతృభాషాభిమాన0 కలిగిన అధ్యాపకేతరులు కూడా ఇ0దులో పాత్రధారులు కావలసి ఉ0టు0ది. ఆధునిక సా0కేతిక పరిజ్ఞానాన్ని వాడకుండా, వేలఏళ్ళుగా వివిధ ప్రదేశాలలో, కాలాలలో వికసించిన సాహిత్యం, శాస్త్రాల నుండి సమాచారాన్ని పొ0దుపరచటానికి, నిలువ  చేయటానికి, మనకు కావలసినదాన్ని చక్కని రూపులో పొందటానికీ (archiving)  కంప్యూటర్ వినియోగ0 ఒక తప్పనిసరి. దీనికోసం  విషయాలవారీ విభజన, వెదకులాటవిషయసూచికలు మొదలైన  ఉపకరణాలను  తయారు చేయాలి . భాష, సాహిత్యం, శాస్త్రం, సా0కేతికత, విద్య, వాణిజ్యంమొదలైన రంగాల సహకార0తో  తెలుగు ఉనికిని కాపాడటంకోస0, మాతృభాషను నేటి సమాచార  అభ్యుదయానికి అనుసంధానం  చెయ్యటం కోసం నిపుణులను ఒకే వేదిక పైకి తీసుకురావలసిన అవసరం ఉంది.
ఒక పుస్తకాన్ని లేదా రికార్డును స్కాన్ చేసి నెట్లో పెట్టడమే డిజిటలైజేషన్ అనే అభిప్రాయ0లో0చి ము0దుగా బయటకు రావాలి. తాళపత్రాల కాల0లో0చి, అరచెయ్య0త తెరమీద పుస్తకాలు చదువుకొనే కాల0లోకి మారిపోయి0ది మన సమాజ0! పుస్తకాలను, అ0దులోని సమాచారాన్నీ చదవట0 మాత్రమే కాదు, విశ్లేషి0చట0, తులనాత్మక0గా అధ్యయన0 చేయట0, దాన్ని మనకు కావలసిన రీతిలొ సరిచూసుకోవట0, క0ప్యూటర్లోనే పదిల పరచుకోవట0. కోరుకొన్న0త మ0దికి దాన్ని ప0చుకోవట0 ఇన్ని0టికి క0ప్యూటర్ అవకాశ0 ఇస్తు0ది. ఇద0తా తెలుగులోనే జరగాలి.
          అ0దరికీ అ0దుబాటైన తెలుగు నడుపు మొగసాల(ఓపెన్ ఆఫీసు) ఉ0డాలి. మొబైల్ ఫోన్లు, ఐఫోన్లు, ఐపాడ్లు వ0టి ఇతర సా0కేతిక ఉపకరణాలలో కూడా తెలుగు నడుపు(పాటి0చట0) ఉ0డాలి. పలికితే అక్షరాలుగా మారట0(voice recognition), పలుకుల విశ్లేషణ(speech synthesis) వెదకులాడే మరలు(search engines) స0గతుల 

ప్రప0చ తెలుగుకు తొలి అడుగు -3


పెళ్లగి0పులు(data mining)అన్నీ తెలుగులో అడిగితే జరిగేలా ఉ0డాలి. నిఘంటువులకు స0బ0ధి0చిన వెదకులాట, సమానార్ధ పదాల ఎ0పిక ,పద విజ్ఞానం, తప్పులదిద్దుబాటు, కొత్తపదాలు  కలపటం, సమీక్ష చేయట0, వాక్య నిర్మాణ విషయాలు ,అర్ధజ్ఞానం, వ్యాకరణ సహాయం  మొదలైన వాటికోసం సాఫ్ట్ వేర్  తయారీ జరగాలి. తెలుగు నిఘ0టువును స0ప్రది0చి అక్కడికక్కడ అర్థ0 తెలుసుకొనే అవకాశ0 ఉ0డాలి. క0ప్యూటర్ సహాయ0తో ఎవరైనా తెలుగు నేర్చుకొనే సదుపాయాలు0డాలి. ఇ-బేరసారాలు (e-commerce) నానానడుపులు (multi-media tools), వికీపీడియా లా0టి విజ్ఞానసర్వస్వాలు, చదువుకు స0బ0ధి0చిన గడపలు (educational portals), తెలుగులో జరగాలి. తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో  డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ ఆధారిత విద్యోపకరణాలు మొదలైన  వాటికోసం  తెలుగు ధాతువులకు స0బ0ధి0చిన డేటాబేసులను అభివృద్ధి పరచాలి. వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన తెలుగు డేటాబేస్ లను అనుసంధానం చేయటం ద్వారా సమాచారాన్ని  అ0దరూ స్వేచ్చగా పంచుకొనె అవకాశ0 కలగాలి. కంప్యూటర్ సహాయంతో ప్రాచీన శాసనాలను,  ప్రాచీన కవుల సాహిత్య కృషినీ ఒక వరుసలో అమర్చి పరిశోధకులకు అందుబాటులో ఉంచటం, తెలుగు శాసనాధారాలను ఒకచోట చేర్చటం కోసం సెర్చ్ ఇంజన్లను తయారు చేయటం. రచనలను పూర్తిగా కంప్యూటర్ భాషలో డిజిటలైజ్ చేసే మార్గాలను కనిపెట్టటం, కొత్త కంప్యూటర్ డేటాబేస్ లను సృష్టించటం ఒక చారిత్రక అవసర0. సా0కేతిక నిపుణులైన తెలుగుబిడ్డలమీద ఈ బాధ్యత ఎక్కువగా ఉన్నదని భ్వాస్తున్నాను. ఇ0గ్లీషు భాషకు ఎ0తో చేసిన మన తెలుగువారు మనసు పెడితే సిలికాన్ లోయలో తెలుగు పూలు పూయి0చగలరనే నమ్మక0 ఉ0ది.  
          ఈ మొత్త0 ఆదర్శాలలో క0ప్యూటర్లకు వెలుపల జరగవలసిన కృషే ప్రథానమై0ది. తరచూ వాడక0లొ ఇ0గ్లీషు పదాలకు తెలుగు సమానార్థకాలను, వాటి ప్రయొగాలనూ మొదట మన0 క0ప్యూటరుకు అ0ది0చాలి జనసామాన్య0 వాడుకొనే తెలుగు పదాలకు, ప్రా0తీయ, మా0డలిక పదాలకు ఇ0గ్లీషు సమానార్థకాలను రూపొ0ది0చి ఒక సమగ్రమైన లెక్సికాన్ క0ప్యూటర్లకు అ0ది0చాలి. లేకపోతే క0ప్యూటర్లు అనువాదాలనెలా చేయగలుగుతాయి...? అచ్చుదోషాలనెలా సరిచూడగలుగుతాయి...క0ప్యూటర్ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవటానికి అనువాద విధానాలూ, తెలుగు విజ్ఞాన కోశాలు, తెలుగు లెక్సికాన్ అనే మహా నిఘ0టు నిర్మాణాలు సమకూరినప్పుడే ఇప్పుడు ప్రార0భమైన తెలుగు సా0కేతిక విప్లవ0 అనేది సార్థక0 అవుతు0ది. ఆర0భ శూరత్వ0లో0చి వాస్తవికతలొకి మన0 మళ్లగలగాలి.  
          ఇలా0టి బృహత్తర కార్యాలను నెతినెత్తుకోవటానికి, ఇతర భాషలలో వర్చూయెల్ అకాడెమీలు, విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. వర్చూయెల్ అనేపదానికి క0ప్యూటర్ ద్వారా సాధి0చినది అని అర్థ0. మిచిగాన్ వర్చూయెల్ విశ్వవిద్యాలయ0 పనిచేస్తో0ది. తమిళనాడులో తమిళ వర్చూయెల్ అకాడెమీని నెలకొల్పి దానికి విశ్వవిద్యాలయ ప్రతిపత్తినిచ్చి, తమిళ వర్చూయెల్ విశ్వవిద్యాలయ0గారూపొ0ది0చారు. పాకిస్తాన్ వర్చూయెల్ అకాడెమీ పాకిస్థాన్ దేశస్థాయిలో పనిచేస్తో0ది.. తెలుగు భాషని సా0కేతిక0గా అభివృద్ధి చేయటానికి ఇలా0టివి మనకూ కావాలి. స0పన్న తెలుగు భాషా స0స్కృతుల అ0తర్జాతీయ సా0కేతిక వేదిక  (International forum for Information and Technology in Classical Telugu Language and Culture) ఒకటి తక్షణ0 ఏర్పడవలసిన అవసర0 ఉ0ది. భాషాభిమాన0 కలిగిన నిపుణులతో, ప్రభుత్వమూ, ప్రజల భాగస్వామ్య0తో స్వత0త్ర ప్రతిపత్తి కలిగి పనిచేసినప్పుడు ఇలా0టి స0స్థలు సక్రమ0గా మనగలుగుతాయి. ప్రప0చ భాషగా తెలుగు రాజిల్లగలుగుతు0ది.

తెలుగు భాషోద్యమానికి శ్రీకార0-4


చివరగా ఒక మాట:
          తమిళులు ఇప్పటికి పది అ0తర్జాతీయ తమిళ సా0కేతిక మహాసభలను వివిధ దేశాలలొ నిర్వహి0చారు. మన0 వారికన్నా పది ఏళ్ళు ఆలస్య0గానే ఈ యాత్రని ప్రార0భిస్తున్నా0. ఇ0దులో నిరాశ చె0దవలసిన దేమీలేదు.
          ఏప్రియల్ 16 సదస్సు దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ0  ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్  తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో స్పెల్ చెకర్ 10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైన కీ బోర్డ్,  6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ,  స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ, సిలికానా0ధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆన0ద్  తన కార్యదక్షతతో కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన  జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.
శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది. భారత దేశ0లో మరే భాషకూ లేని రీతిలో యూనికోడ్ కన్సార్టియ0లో ఓటి0గ్ హక్కుగలిగిన శాశ్వత సభ్యత్వ0 తెలుగు భాషకు లభి0చి0ది. ఇది ప్రతి తెలుగువాడూ  గర్వపడాల్సిన విజయ0! ఈ మొత్త0 పరిశ్రమ అ0తా కేవల0 మూడునెలల కాల0లోనే జరిగి0ద0టె నమ్మలేని నిజమే! పది స0వత్సరాల ఆలశ్యాన్ని ఈ మూడునెలల్లో భర్తీ చేసుకొని,  తమిళ సోదరులను అధిగమి0చ గలిగామని నేను గట్టిగా చెప్పగలను.
ప్రముఖ0గా గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ స0స్థల ప్రతినిధులు వారి ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతనిచ్చే చర్యలను ఈ సదస్సులో విశ్లేషి0చే0దుకు ము0దుకు వస్తున్నారు.  వారికి తెలుగు ప్రజల0దరి పక్షాన స్వాగత0 పలుకుతున్నాను.  ఆ0ధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్వర్క్-  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమర్నాథ రెడ్డి గారికి, గ్లోబల్ ఇ0టర్నెట్ తెలుగు ఫోర0 అధ్వర్యాన జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్య బాధ్యత వహిస్తున్న ఆచార్య పేరి భాస్కరరావు గారూ, ఆచార్య జి. ఉమామహేశ్వర రావు గారూ తదితర సభ్యుల0దరికీ అభివాదాలు తెలియ చేస్తున్నాను. 
          విజ్ఞాన0 వికసి0చిన మూడొ కన్ను- వివేక0 మీకున్న ఒకే ఒక దన్ను అ0టారు ఆరుద్ర.  ఆలశ్య0 అయితేనే0...? విజ్ఞాన0 కోస0 వివేక0 ప్రదర్శిస్తున్న ఒక శుభముహూర్త0 ఇది. ఆలశ్యమే గానీ అలసత్వ0 కాదని తెలుగు వాళ్ళు నిరూపి0చుకో గలుగుతున్నారు. అ0దరికి అభివాదాలు. జై తెలుగు తల్లి!!!

Gandhi Statues in USA

Gandhi Statues in USA

Mana Badi with Ponnala Laxmaih,Ma Badi with Ponnala Laxmaih,Mandali Buddha Prasad,Prachina Telugu Bhasha Charitra,Telugu Internet Meet,


Mana Badi with Ponnala Laxmaih,Mandali Buddha Prasad,Telugu Internet Meet,


Mana Badi with Ponnala Laxmaih


Ma Badi with Ponnala Laxmaih


With Gandhi statues in USA


glowing tributes to Mandali Venkata Krishna Ra


tributes to former minister Mandali Venkata Krishna Rao


  Telugu leaders and scholars who came here from all over the world to participate in the first International    Telugu internet conference paid glowing tributes to former minister Mandali Venkata Krishna Rao on Tuesday.

                   AP Hindi academy chairman Yarlagadda Lakshmi Prasad presided over the death anniversary of Venkata Krishna Rao organized by Silicon Andhra at the Indian communicate center here said that the seed that grew into the tree of the first internet conference was planted by Venkata Krishna Rao when he conducted the first world telugu conference in Lal bahadur stadium Hyderabad.

                 Silicon Andhra founder and Secretary  said that the organization was trying to continue with commitment what Venkata Krishna Rao began with first world telugu conference.

               Former minister Mandali Buddha Prasad  said that unless Andhra Pradesh government took it upon itself to promote telugu language, the language slowly deteriorate and disappear. He said people the Telugus were great but they weren’t progressing for lack of proper leaders. He said his father was great influence on him and that he would continue the work he started.

Andhra praba editor Vijay Babu said that Venkata Krishna Rao was totally preoccupied with serving the people.

 Former vice chancellor of Telugu university A Bumaya and MLC ilapuram Venkaiah spoke

వైభవంగా జరిగిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం


వైభవంగా జరిగిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

సిలికానాంధ్ర పదకొండో ఆంధ్ర సాంస్కృతికోత్సవం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో శనివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం) అత్యమ్యంత వైభవంగా జరిగింది. సిలికాన్‌వేలీ లోని వివ్ధ ప్రాంతాల నుండి రెండు వేలకు మందికి పైగా తెలుగువారు హాజరై పది గంటల పాటు 350 మంది బాల, యువ, మహిళా కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య, నాటక, జానపదా ప్రదర్శనలు ప్రేక్షకులను సాంస్కృతిక విందునందించాయి. ప్రాంతీయ బేధాలు మరచి వందలాది మంది మహిళలు ప్రదర్శించిన ఎల్లమ్మ నృత్యం, బతుకమ్మ క్యూపర్టినో నగరాన్ని ఉర్రూతలూగించాయి. రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సిలికానాంధ్ర ప్రపంచంలో అరుదైన సమ్ష్త అనిప్రశంసించారు. భాషా సాహిత్య సంస్కృతులను పరిరక్ష్మిచేందుకు అహర్నిశ పాటుపడుతున్న సిలికానాంధ్ర దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆదర్శమని అన్నారు. ' దేశభాషలందు తెలుగు లెస్స ' అన్న మాట ఎంత ప్రధానమైనదో తెలుగు సమ్ష్థ లన్నిటిలో సిలికానాంధ్ర మిన్న అని పొన్నాల చెపారు. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ సిలికానాంధ్రకు సంస్కృతి పరిరక్షణకు సంబంధించి గొప్ప ఆలోచనలున్నాయని వాటిని నిజం చేసే శక్తిగల సాంస్కృతిక సైనికుల్లాంటి కార్యకర్తలున్నారని అయితే ఆర్ధికంగా తగిన సహకారం అందించాలని అన్నరు. ప్రముఖ వైణికుడు వీణ శ్రీనివాస్ నిర్వహణలో సాగిన కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చ్యాత్య సంగీత సంగమం, అనూష కూచిభోత్ల నృత్య కల్పనలో సాగిన స్వర గంగాఝరి, మైం మధు చే మౌన తరంగం, స్నేహ వేదుల ఆధ్వర్యంలో జరిగిన జానపద నృత్యాలు, శిరిని సూరపనేని నృత్య రూపకల్పనలో సాగిన ఆంధ్ర కళా విలాసం, పద్మిని సరిపల్లె, రత్నమాల వంక సారధ్యంలో పాటలపల్లకి, విజయసారధి మాడభూషి నేతృత్వంలో ప్రదర్శించిన రాణా ప్రతాప్ నాటకం తదితర ప్రదఋసనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అద్యక్షులు అచార్య అనుమండ్ల భూమయ్య జ్వలిత కౌసల్య పద్య కావ్యం నాలుగో ముద్రణను ప్రవాసాంధ్రుడు డా. లక్కిరెడ్డి హన్మిరెడ్డి ఆవిష్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపకుడు డా. చెన్నయ్య గారి వ్యాఖ్యానం కార్య్క్రమానికి నిండుదనం సంతరించింది.

Thursday 22 September 2011

All guests look release of Telugu Punnami


Yarlagadda taking blessings of Cinare surprised all


Yarlagadda WITH Ramojirao


Cinare release PUNNAMI VENNALA BOOK


Cinare release Souvenir


Yarlagadda,BuddhaPrasad with Cinare

yarlagadda,abk,prachina telugu lipi,damodhar rao musham,Mandali Buddha Prasad US trip 

Schedule,తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,



Lighting Candles


Leading guests to Stage


Unveiling Telugutalli statue


Going to invite chief guest


Inviting CINARE and Ramoji rao


Yarlagadda,BuddhaPrasad felicitaing ASI director Chinna Reddy


World Telugu writers conference Dias,


Stage of World Telugu writers conf,


Wednesday 21 September 2011

ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు

ప్రాచీన భాషగా అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు

కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా తమిళ భాషకు గుర్తింపు నిచ్చిన వెంటనే తొలిగా ప్రతిస్పందించింది బుద్ధప్రసాద్‌! ఆనాడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా తెలుగు భాషకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని చర్చకు కోరుతూ ఒక అనధికార తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు.
ఇలా భాష కోసం రాజకీయ వ్యవస్థని కదిలించగలగడం మన రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పాలి. బాష గురించి మాట్లాడేవాళ్ళ పట్ల రాజకీయ నాయకులకు సహజంగా ఉండే చిన్న చూపుని బుద్ధప్రసాద్‌ తోసి రాజనగలిగారు. ఈ రోజున ఏ మంత్రిపదవీ, కనీసం శాసనసభ్యత్వం లాంటివి కూడా లేకపోయినా, దేశంలో తెలుగు భాషా సంస్కృతుల నిలువెత్తు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
శక్తులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తెలుగు భాషకు విశిష్ట ప్రాచీనతా హోదాకోసం పోరాటం : 2004 సెప్టెంబర్‌ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం తమిళ భాషకు క్లాసికల్‌ హోదాని ప్రకటించిన తరువాత బుద్ధప్రసాద్‌ తెలుగు భాషోద్యమ శక్తియుక్తులన్నింటినీ తెలుగు భాష ప్రాచీనత నిరూపించే పరిశోధనలవైపు, కార్యక్రమాలవైపు మళ్లించారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వంపైన రాజకీయ వత్తిళ్ళతోనే తెలుగు భాషకు ప్రాచీనతా హోదాని సాధించగలమనేది వాస్తవం. అయినా, బుద్ధప్రసాద్‌ తెలుగువారి ప్రాచీనతని నిరూపించవలసిందిగా పరిశోధకులకు గట్టి పిలుపునిచ్చారు. తెలుగు భాష ప్రాచీనతని నిర్ణయించటం, ప్రాచీనమైన తెలుగు సంస్కృతిని పరిరక్షించే చర్యలు తీసుకోవటం పైన బుద్ధప్రసాద్‌ ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరించి భాషోద్యమాన్ని కొత్త మార్గాన నడిపించారు. భాషావేత్తలతోపాటు, చరిత్రకారులూ, ఔత్సాహికులైన పరిశోధకులూ ఆయన పిలుపుకు ఎంతగానో ప్రతిస్పందించి ఈ ఐదేళ్ళ కాలంలో వెలుగులోకి తెచ్చిన విశేషాలు ఎన్నో వున్నాయి. బుద్ధప్రసాద్‌ నాయకత్వాన తెలుగే ప్రాచీనమని ఎలుగెత్తి చాటారు తెలుగు ప్రజలు. కృష్ణా జిల్లా రచయితల సంఘం బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన విజయవాడలో తెలుగుభాష విశిష్టత ప్రాచీనతలపైన జాతీయ సదస్సు, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ బుద్ధప్రసాద్‌ ప్రేరణతో ఢిల్లీలో 2008 జూలైలో నిర్వహించిన తెలుగు కన్నడ సదస్సు ముఖ్యమైన మలుపులుగా తెలుగు భాషకు క్లాసికల్‌ హోదా లభించింది. ఎందరినో ఇందులో భాగస్వాములను చేసి అన్నింటా తానై, అన్ని విధాలా తీసుకువచ్చిన వత్తిడి ఫలితంగానే మనం తెలుగు భాషకు క్లాసికల్‌ హోదాని సాధించుకో గలిగామన్నది వాస్తవం.
- డా్ప్ప జి.వి.పూర్ణచందు

శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు

అది, 2008లో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన మంటపాన్ని పునర్నిర్మింపచేసి, అందులో కృష్ణ దేవరాయలు కావ్యరచన చేస్తున్న భంగిమలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తున్న సందర్భం. రాష్ట్రం అంతా బుద్ధప్రసాద్‌ కు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందనీ ఆయనకు విద్యా, సాంస్కృతిక శాఖలు అప్పగిస్తారని ఎదురు చూస్తున్న సమయం అది. సరిగ్గా సభలు ప్రారంభమయ్యే సమయానికి కృష్ణా జిల్లాకు ముఖ్యమంత్రి అధికార పర్యటనకు వచ్చారు .పదవులు ఆశిస్తున్న జిల్లా రాజకీయ శక్తులన్నీ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకరించి ఉన్నాయి. బుద్ధప్రసాద్‌ మాత్రం సభల ఏర్పాటు మీద మాత్రమే మనసు లగ్నం చేశారు ముఖ్యమంత్రి కలవటానికి వెళ్ళనే లేదు. అదీ ఆయన నిబద్ధత...!
శ్రీకాకుళం సభలు : రెండవ తెలుగు భాషోద్యమం : మండలి బుద్ధప్రసాద్‌ నేతృత్వంలో తెలుగువారి తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబర్‌ 1, 2 తేదీలలో జరిగిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం తెలుగు భాషోద్యమానికి నాందీ పలికింది. అమ్మ భాష పట్ల మమతానురాగాల్ని పెంపొందించటం ప్రధాన కార్యక్రమంగా ప్రజల గుండె తలుపులు తట్టి భాషా చైతన్యాన్ని కలిగించే అనేక కార్యక్రమాలు ఆనాటినుంచీ తెలుగు నేలమీద ముమ్మరంగా జరిగాయి. ఇదే సభలో తెలుగు భాషోద్యమ సమాఖ్య శ్రీకారం చుట్టుకుంది. బుద్ధప్రసాద్‌ నాయకత్వంలో డా. సామల రమేష్‌బాబు, సి.ధర్మారావు ఇంకా ఎందరో బాషోద్యమానికి నడుం బిగించారు. గిడుగువారు నడిపిన వ్యావహారిక భాషోద్యమానికి కొనసాగింపుగా దీనిని రెండవ తెలుగు భాషోద్యమం అన్నారు.
జీవో నం.86 సాధన : తెలుగువాడిగా పుట్టి, తెలుగునేల మీద తెలుగు అక్షరంముక్క నేర్చుకోకుండా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తిచేసుకునే దురదృష్టకర అవకాశం ఈ దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు చదవకుండా వుంటేనే ప్రభుత్వ గుర్తింపు ఉంటుందనే పరిస్థితి నడుస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు బుద్ధప్రసాద్‌. దానిపైన విస్తృత పోరాటమే ఆయన చేయాల్సి వచ్చింది. తెలుగు భాషోద్యమం, తెలుగు భాషోద్యమ సమాఖ్య, తెలుగు భాషాభిమానులు ఆయనకు అండగా నిలబడ్డారు. దాని ఫలితంగానే జీవో నం.86 ను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. అక్షరాభ్యాసం నుంచి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధనాంశంగా ఉండాలనేది ఈ 86వ జీవో సారాంశం. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగును తప్పనిసరి చేస్తున్న జీవో. భాషోద్యమ పరంగా ఇది బుద్ధప్రసాద్‌ అధిగమించిన ఒక మైలురాయి. హైదరాబాద్‌లో తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగుతల్లి అని తెలుగులో రాయకపోవటం, సెక్రెటేరియట్‌లో రాష్ట్ర సచివాలయం అని తెలుగు అక్షరాల్లో ఎక్కడా లేకపోవడం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా ఒక్క తెలుగు బోర్జు కనిపించకపోవడం ఇలా తెలుగు అనేది ఒక పనికిరాని అంశంగా మారిపోతోందని ఆయన ఆవేదన చెంది చేసిన ఆందోళన ఫలితంగా సచివాలయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. తెలుగు తల్లి అని మనం ఇప్పుడు తెలుగులో చదవవచ్చు.

తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ,


ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి కర్త, కర్మ, క్రియ ఆయనే! ప్రజల గుండె తలుపులు తట్టి వారిలో తెలుగు భాష పట్ల గౌరవాన్ని, తెలుగు సంస్కృతి పట్ల అభిమానాన్ని ప్రేరేపిస్తూ, భాషా జాతీయులుగా తెలుగు వారి చరిత్రని వెలుగులోకి తేవటం ఆయన ఏర్పరచుకొన్న పెద్ద ప్రణాళిక. ఆయన అడుగులో అడుగువేస్తూ ఆయన్ని వెన్నంటి ఎందరో ప్రముఖులైన సాహితీవేత్తలు, భాషావేత్తలూ, చరిత్రవేత్తలు నడుస్తున్నారు. మరెందరో భాషాభిమానులు వీర సైనికులై కవాతు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన బుద్ధప్రసాద్‌ కృషి ఫలితంగా, ఇంటి భాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు గురించి ఆయన నేతృత్వంలో జరుగుతున్న పోరాటాలకు ఇప్పుడు విశేఓష స్పందన వస్తోంది. 2002 నుంచి ఇదే అంశంపైన దృష్టి కేంద్రీకరించి సాగిస్తూ వస్తున్న అనేక కార్యక్రమాలకు ఫలాలు అందటం అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రజలు తెలుగులో మాట్లాడటం ఒక గౌరవనీయమైన అంశంగా భావించుకోవటం ఎల్లెడలా కనిపిస్తోంది. ఇది ఆహ్వానించదగిన చక్కని పరిణామం.
స్వాతంత్య్రోద్యమం తర్వాత పుట్టినవారే ఎక్కువగా ఉన్న ఈనాటి సమాజంలో ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందో బుద్ధప్రసాద్‌ నాయకత్వాన తెలుగు భాషోద్యమంలో పనిచేస్తున్న వారికి చక్కగా అనుభవంలోకి వస్తోంది. గాంధీ సిద్ధాంతాలను, ఆయన నాయకత్వ విధానాన్ని, ఆయన కార్యచరణను పుణికి పుచ్చుకొని తెలుగు భాషోద్యమాన్ని ఆయన నడుపుతున్నారు. వ్యక్తిగతమైన ప్రచారాలకు ప్రయోజనాలకు ప్రభావాలకూ తావివ్వని రీతిలో ఆయన ఈ ఉద్యమాన్ని నడుపుతున్న తీరు సన్నిహితంగా వ్యవహరించేవారికి సైతం విస్మయం గొలుపుతుంది. ఒక చిన్న సంఘటనని అప్రస్తుతమైనా ఇక్కడ ప్రస్తావించక తప్పదు

తెలుగు సాంస్కృతిక 'మండలి'


తెలుగు సాంస్కృతిక 'మండలి'

ANDHRA PRABHA NEWS
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పురావైభవాన్ని చాటడం ఆయన లక్ష్యం. అందుకోసం అందుకోసం ఎంతటి శ్రమకైనా తట్టుకోగలిగే గుండె నిబ్బరం ఆయనకుంది. సమాజం, సాహిత్యం, సంస్కృతుల త్రివేణి మండలి బుద్ధప్రసాద్‌. తెలుగు వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనం. దార్శనికుడయిన తండ్రి మండలి వెంకట కృష్ణారావు, సంస్కృతి ప్రతిబింబమైన తల్లి ప్రభావతీ దేవి కలల పంటగా 1956 మే నెల 26వ తేదీన బుద్ధప్రసాద్‌ జన్మించారు, తెలుగు దనం- తెలుగుధనం నిండిన కుటుంబం, గాంధేయ వాదం, గాంధీ నాదం ప్రతిధ్వనించే ఇల్లు... పుట్టిన నాటినుంచీ పెరిగిన, ఎదిగిన జాతీయతా భావం, అన్నీ కలగలసి మూర్తీభవించిన రూపసి బుద్ధప్రసాద్‌. డా. బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య ఎన్‌.జి.రంగా, ప్రభాకర్‌ జీ లాంటి సత్ఫురుషుల సాంగత్యం చిన్ననాటినుంచే కలిగాయి. మండలి వెంకట కృష్ణారావు గారి సేవా నిరతిని అందుకుంటూ, ఆ ఆలోచనల్లోంచి, ఆచరణల్లోంచి, ఆకాంక్షల్లోంచి అంకురించి, తండ్రిని మరిపించిన మహావృక్షమై ఎదిగాడు బుద్ధప్రసాద్‌.
apr -   Sun, 22 May 2011, IST
''యం సంగతి గుణా: పుంసాం వికసంత్యేన తే స్వయం'' అంటుంది ఆర్యోక్తి. యోగ్యమైన గుణాలు ఉంటే వాటంతట అవే బయటపడి లోకోపకారకం అవుతాయి. కస్తూరి సువాసనని ఆపితే ఆగుతుందా... అని అడుగుతుందా శ్లోకం. యోగ్యతలు లోకహితం కావాలి. మండలి బుద్ధప్రసాద్‌ యోగ్యమైన ఆలోచనలన్నీ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా సాగాయి. బుద్ధప్రసాద్‌ తెలుగు భాషోద్యమ నిర్మాణం కోసం మొదటగా నడుం బిగించిన యోథుడు. ఆయనే ప్రేరకుడు, ఆయనే పాత్రధారి, ఆయనకు ముందు ఎన్నో తరాలుగా భాషా పరిరక్షకులు వెలిగించిన జ్యోతిని ఆయన అందుకున్నారు. ఒక జ్యోతితో అనేక జ్యోతులను వెలిగించినట్టు ఆయన భాషోద్యమ కార్యకర్తలను తీర్చిదిద్దుతున్నారు.

Tuesday 20 September 2011

తొలి తెలుగు మహిళా ఆత్మకథ


తొలి తెలుగు మహిళా ఆత్మకథ – ఏడిదము సత్యవతి ఆత్మచరితము


ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రామకృష్ణ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి
for more info see http://prachinatelugu.blogspot.com

Mandali Buddha Prasad US trip Schedule


Mandali Buddha Prasad(Former Minister of AP) US trip Schedule


Emirates - EK 525 FRI 23SEP 
HYDERABAD(04:20) DUBAI AE(06:20)

Emirates - EK 225 FRI 23SEP 
Dubai AE(08:20)    San Fransisco CA(13:05)

25-27 sept 2011 -  San Jose/San Fransisco

27 sept 2011. -  Mandali Venkata Krishna Rao Vardhanthi

28-30 sept 2011 - International Telugu Internet Conference, MILPITAS, CA (click here for schedule)

1st Oct 2011 -  Andhra Cultural Festival, DeAnza College,Cupertino,CA

2nd Oct 2011 - Gandhi Jayanthi

san fransisco - miami
AMERICAN AIRLINES - AA 440
MON 03OCT      SAN FRANCISCO CA(13:00)    MIAMI FL(21:30)

4-6 oct 2011 Miami    {contact no. ..............for contact no @ us

miami-new york
AMERICAN AIRLINES - AA 518
FRI 07OCT      MIAMI FL(07:10)            NEW YORK NY(09:55)

7-9 oct 2011 New York/New Jersey.    {contact no. 

9th night back to hyderabad

Emirates - EK 202
SUN 09OCT      NEW YORK NY(23:00)        DUBAI AE(19:45)

Emirates - EK 524 MON 
10OCT DUBAI AE(21:45)      HYDERABAD IN (02:55)

Tuesday 23 August 2011

ఎందరో మహానుభావులు VLC video


  • Nagaih acted and sung this great song for film before TRAVANCORE SHRI GOVINDA RAJULU and MYSORE EXPERTS GREAT MAN INDEED AS  Sri Tyagaraja to give such a fine kruti to telugu language..



  • ఎందరో మహానుభావులు
    అందరికీ వందనములు
    ఎందరో మహానుభావులు 
    Rgveda Samaveda matras align in UNICODE FONTS,antarjala,buddhism,Telugu as Latin Tocharin,fossiled language,Ancient Telugu script 
    around the world,Computer Language for vedas




  • Sunday 21 August 2011

    Mauritius Andhra Mahasabha members with CM,Chakrapani,Mandali


    viswanatha satyanarayana anandam tree

    viswanatha satyanarayana anandam tree,damodhar rao musham sitting under Tree

    Pedda Balasiksha CD


    Pedda Balasiksha CD

    Language was a culture that kept people united, and ignorance of the language culture was dividing people, the Avanigadda MLA and president of the Telugu Bhashodyama Samakhya, Mandali Buddha Prasad, said on Saturday.
    Releasing a compact disc (CD) on `Pedda Balasiksha' here on Saturday, Mr. Prasad lamented that Telugus were not united, despite being pioneers in the agitation for the formation of States on linguistic basis. He lauded the service rendered in bringing out a book, which was published 172 years ago, in the form of a CD. Underscoring the need to protect and promote the mother tongue, he said non-resident Telugus would patronize the CD more than those living in the State.
    `Pedda Balasiksha' is a compendium of several "facts of life." The then Governor of the Madras State compiled it in 1822. The `Balasiksha,' authored by Puduru Sitarama Sastry, was first published in 1832. It was prepared with perfect planning and a definite idea of the grasping ability of children. The second edition was published after 24 years. It is only in 1865 that `Pedda Balasiksha,' with improved and increased content, was published. for info call me 9 damodharraom@gmail.com,

    Prapancha Telugu Rachayithala Mahasabhalu AUGUST,11 at Vijayawada,Krishna zilla rachayithala sangham


    Mandali Buddhaprasad,Padmashri Yarlagadda LakshmiPrasad,ABK,Guttikondo Subbarao,Dr G V Purnachand,Prapancha Telugu Mahasabhalu AUGUST,11 at Vijayawada,Krishna zilla rachayithala sangham,Damodhar rao musham etc were present.
    http://prachinatelugu.blogspot.com/2011/08/dont-make-telugu-fossiled-language.html

    gidugu awarded KAIZER-E-Hind


    Distinguished pandits like CV sastry Sri T.Sivasankara Sastry, Sri Veerasalingam, Sri P. Adinarayana Sastry, Sri V. Rama Sastry supported the reformation towards colloquial language. On 28 February 1919 “Varthamaana Andhrabhasha pravartaka samajam” was established with Veeresalingam as President and Gidugu as secretary. In 1924 Andhra Sahitya Parishat lifted the ban on Colloquial language.
    On 15 January 1940, Gidugu addressed some editors as his last request. He was glad to see the colloquial language use was spreading. He lamented the fact that the Government's education department and the Universities are still using the Prose.
    Madras government recognized Gidugu's services and awarded his 'Kaizer-e-Hind' medal.
    Gidugu Rammurty died on 22 January 1940.