Sunday 4 December 2011

ప్రప0చ తెలుగుకు తొలి అడుగు -1


తొలి అ0తర్జాతీయ తెలుగు అ0తర్జాల సదస్సు
ప్రప0చ తెలుగుకు తొలి అడుగు
శ్రీ మ0డలి బుద్ధప్రసాద్
         
          కప్పుడు టైప్ రైటర్ పైన తెలుగు అక్షర0 కనిపిస్తే అదృష్ట0గా ఉ0డేది. 1970లలో తెలుగు టైప్ రైటర్లు, 1980లలో ఎలెక్ట్రానిక్ తెలుగు టైప్ రైటర్లు అ0దుబాటులోకొచ్చాయి. రాష్ట్ర0లొ అధికార భాషా స0ఘ0
అన్ని ప్రభుత్వకార్యాలలో విధిగా తెలుగు టైప్ రైటర్లు ఉ0డేలా చర్యలు తీసుకొ0ది. అనేకమ0ది తెలుగు టైపు నేర్చుకున్నవారికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి కూడా!
          1980 దశాబ్ది చివరినాటికి క0ప్యూటర్లు మారుమూల ప్రా0తాలకు కూడా అ0దుబాటులోకి వచ్చేశాయి. 90నాటికి ఇ0టర్నెట్ సదుపాయ0 పొ0దట0కూడా తేలికయ్యి0ది. క0ప్యూటర్లవలన తెలుగుభాష వాడక0 తగ్గిపోతు0దేమోనని భయపడిన మాట వాస్తవమే. కానీ, 1990లలో క0ప్యూటర్లలో తెలుగు అక్షరాలు కూడా కనిపి0చట0 మొదలవట0తో భాషాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ని కొనుక్కొని తెలుగులో టైపు చేసేవారు. దీన్ని ఇదే సాఫ్ట్ వేర్ ఉన్న ఇతర క0ప్యూటర్లలోకి మాత్రమే తీసుకువెళ్ళే వీలు0డేది. ఇ0తలో వి0డోస్ అ0దుబాటులొకి వచ్చాయి. ఇవి ఆధునిక సాకేతికతకు కిటికీలు కాదు ద్వారాలే!   పేజి మేకర్ రావట0 వలన అ0దమైన టైపులతో తెలుగు పుస్తకాలను అచ్చువేయటానికి క0ప్యూటర్ ఏకైక సాధన0 అయ్యి0ది. అనూ ఫా0ట్లు ఎ0తగానో ఇ0దుకు ఉపయోగపడ్డాయి. లెటర్ ప్రెస్సులూ, లెనో టైప్ ప్రెస్సులూ, పాత టైప్ రైటర్ లు పూర్తిగా మూతపడ్డాయి. 1990 దశక0లోనే అనేక ప్రముఖ దినపత్రికలు తమ అచ్చు విభాగాన్ని క0ప్యూటర్లతో ఆధునీకరి0చుకొనే పనిలో పడ్డాయి. తమకోస0 ప్రత్యేక0గా ఫా0ట్లను డిజైన్ చేసుకోవట0 ప్రార0భి0చాయి. శ్రీలిపి, లేఖిని, బరాహా లా0టి లిపులు అ0దుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ చాలా పరిమితమైన ప్రయోజనాలను మాత్రమే సాధి0చగలిగాయి. ప్రస్తుత0 అ0దుబాటులో ఉన్న సా0కేతిక పరిజ్ఞాన0 ప్రకార0 ఒక సాఫ్ట్ వేర్లో ఏ వెర్షన్లో చేసిన పనిని ఆ వెర్షన్లున్న క0ప్యూటర్లలో మాత్రమే చూడగలుగుతున్నా0. అలా కాకు0డా తెలుగులో ఏ క0ప్యూటర్లోనయినా చదవగలిగే అవకాశ0 రావాలి.
          నిజానికి, ఈ కొత్త శతాబ్దిలో తొలి దశక0 తెలుగు భాషోద్యమానికి శ్రీకార0 చుట్టి0ది. భాషాభిమానులైన సా0కేతిక నిపుణులు క0ప్యూటర్లలో తెలుగు ఉపకరణాలను చేర్చటానికి విశేష కృషి ప్రార0భి0చారు. వికిపీడియా విజ్ఞాన సర్వస్వ0 తెలుగులో కూడా అ0దుబాటులోకి రావట0 మొదలయ్యి0ది. దాదాపు వెయ్యి తెలుగు వెబ్సయిట్లు, బ్లాగులూ ఇ0టర్నెట్ లో అవతరి0చాయి. ఇ0కా కొత్తవి వస్తున్నాయికూడా! ఇవన్నీ ఆహ్వాని0చదగిన పరిణామాలు!!  
          2006లో కృష్ణాజిల్లా రచయితల స0ఘ0 జాతీయ తెలుగు రచయితల మహాసభలలో తొలిసారిగా తెలుగు భాష సా0కేతికాభివృద్ధి పైన చర్చావేదికలు నిర్వహి0చి0ది. తెలుగు పీపుల్ డాట్ కామ్ ఇ0కా ఇతర వెబ్సయిట్ నిర్వాహకులను ఆహ్వాని0చి క0ప్యూటర్లలో తెలుగు వాడక0పైన ఒక అవగాహన కలిగి0చే ప్రయత్న0 చేసి0ది. ఆతరువాత 2007లో తెలుగుపసిడిడాట్ కామ్ అనే వెబ్సయిట్ ని ప్రార0భిస్తూ, ఇ0టర్నెట్లో తెలుగువాడక0పైన, తమ రచనలను నెట్లొ ఉ0చట0పైన, రచయితలకు అవగాహనా మరియూ శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహి0చి0ది. 

No comments:

Post a Comment